- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అగ్గిలా మారి వణికిస్తా.. గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: తన శరీర రంగుపై ట్రోల్స్ చేసే వారికి తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ బాలికల పాఠశాల వార్షికోత్సవంలో తమిళి సై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాడీ షేమింగ్ చేసే ట్రోలర్స్పై మండిపడ్డారు. కొందరు తాను నల్లగా ఉన్నానంటూ తన కలర్పై ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ.. తాను నల్లగా ఉన్నానని ఎవరైనా అంటే.. అగ్గిలా మారి వణికిస్తానని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. తన రంగుపై ట్రోల్స్ చేసేవారు ఊహించలేని స్థాయికి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. కొందరు అదే పనిగా తన శరీర చాయపై విమర్శలు చేస్తున్నారని ఆమె సీరియస్ అయ్యారు. కాగా, గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Next Story