- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంతి కుమారి వీఆర్ఎస్.. తెలంగాణ నెక్ట్స్ CS ఇతనే?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు నియమితులుకానున్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు నియమితులుకానున్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్ల్లో శశాంక్గోయల్తరువాత సీనియర్గా రామకృష్ణారావు ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనకున్న అనుభవం తొడ్పడుతుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆయనను సీఎస్గా నియమించాలనే ఆలోచన చేసినట్లుగా సమాచారం.
రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుత సీఎస్శాంతి కుమారి తన సర్వీసుకు వీఆర్ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఆమె వీఆర్ఎస్నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లుగా సమాచారం. దీంతో కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. వాస్తవంగా శాంతి కుమారి ఈనెలఖరున పదవీ విరమణ చేయనున్నారు. అంత కంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది.
1989 బ్యాచ్ఐఏఎస్కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పటి వరకు సీఎస్గా ఉన్న సోమేశ్ కుమార్ ఏపీకి అలాట్ కావడంతో ఆమె సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. వీఆర్ఎస్ తరువాత శాంతి కుమారి ని చీఫ్ఇన్ఫర్మేషన్కమిషనర్గా నియమించనున్నట్లుగా సమాచారం. ఆమె నియామకం ఇప్పటికే ఖరారు అయిందని, కేవలం అధికారిక ప్రక్రియ మాత్రమే జరగాల్సి ఉందని తెలిసింది. వచ్చే వారం సమాచార కమిషనర్లకు సంబంధించిన నియామక సమావేశం జరగనున్నట్లుగా తెలిసింది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆమెతో పాటు మరికొందరు సమాచార కమిషనర్లుగా నియమించనున్నట్లుగా తెలిసింది. గత కొన్నాళ్లుగా ఖాళీగాఉన్న సమాచార కమిషనర్ల పోస్టులు భర్తీ కానున్నాయి.






