ఎన్నికల వేళ T- బీజేపీ కీలక నిర్ణయం!

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ T- బీజేపీ కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీసుకు భద్రత పెంచింది. 18 మంది ప్రైవేట్ సిబ్బందితో సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ కార్యాలయానికి ముప్పుందని గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. పలు భద్రతా లోపాలున్నాయని, వాటిని సరి చేసుకోవాలని ఇంటలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో భద్రత బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బీజేపీ నేతలు వాదించినా.. తెలంగాణ సర్కారు మాత్రం స్పందించలేదు.

దీంతో బీజేపీనే భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంది. పార్టీ ఆఫీసులో మెటల్ డిటెక్టర్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జాతీయ నేతలు, కేంద్రమంత్రులు కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుండి బీజేపీ కార్యాలయం పూర్తిగా ప్రైవేట్ భద్రతా సిబ్బంది చేతుల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం.

Also Read..

పొంగులేటిలో తగ్గిన జోష్... కారణం జగన్ వద్దని చెప్పాడా?

Next Story

Most Viewed