సంక్రాంతి పండుగ ఎఫెక్ట్... సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

by Disha Web Desk 1 |
సంక్రాంతి పండుగ ఎఫెక్ట్... సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 10న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07065), సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ టౌన్‌ (07066), నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌(07251), 11న కాకినాడటౌన్‌ నుంచి సికింద్రాబాద్‌ (07067), సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌ (07252), 12న సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ టౌన్‌ (07250), 13న కాకినాడ టౌన్‌ నుంచి తిరుపతి ప్రత్యేక రైలు (07249) నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 16న కాకినాడ టౌన్‌ నుంచి సికింద్రాబాద్‌ (07253), 17న సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07254) నడవనున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.


Next Story