- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ఎన్నికల వేళ కీలక నేతలను సస్పెండ్ చేసిన టీ- కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజీవ రెడ్డి, ఆదిలాబాద్

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజీవ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, నాయకులు భార్గవ్ దేశ్ పాండే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతలను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. కాగా, ఆదిలాబాద్ టికెట్ను సంజీవ రెడ్డి ఆశించగా.. పార్టీ మాత్రం ఆ సీటును కంది శ్రీనివాస్ రెడ్డికి కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురై సంజీవ రెడ్డి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరిన.. అందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వారిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకుంది.






