త్వరలోనే RTC కార్మికులకు భారీ గుడ్ న్యూస్..? మే డే వేళ KCR కీలక ప్రకటన

by Disha Web Desk 19 |
త్వరలోనే RTC కార్మికులకు భారీ గుడ్ న్యూస్..? మే డే వేళ KCR కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెరగనున్నాయి. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖనును సీఎం ఆదేశించారు. దీంతో సాధ్యసాధ్యాలపై ఆర్టీసీ కసరత్తు చేస్తోన్నది. సర్కార్​ జీతాలు పెంచితే ఆర్టీసీ లోని అన్ని విభాగాలు సుమారు 45 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.

దీంతో ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ హర్షం వ్యక్తం చేశారు. ఇక మే డే కానుకగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా వెయ్యి రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ పెరగనున్నాయి.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నది. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నది. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడింది.తద్వారా పారిశుధ్ద్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు”అంటూ సీఎం కేసీఆర్​అభినందనలు తెలిపారు.


Next Story

Most Viewed