కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వేళ ఆర్ఎస్పీ సంచలన ట్వీట్

by Disha Web Desk 4 |
కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వేళ ఆర్ఎస్పీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం జరుగుతున్న వేళ సీఎం కేసీఆర్‌పై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సెక్రటేరియట్‌కు సంబంధించి వివిధ పత్రికల్లో ఊదరగొడుతూ ఇచ్చిన యాడ్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తూ రాయించుకున్న రాతలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం చేసిన పోరాటంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన నలుగురు పిల్లలను త్యాగం చేశారని గుర్తు చేశారు. మాతృభూమి కోసం అంబేద్కర్ అన్ని సమయాలను కేటాయించారని తెలిపారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు పూర్తిగా విరుద్ధమన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలతో కేసీఆర్ తన కుటుంబ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ భవిష్యత్తును కూడా దోచుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

Next Story

Most Viewed