లోన్ల పేరిట రూ.5 కోట్ల కుచ్చుటోపీ

by Disha Web Desk 4 |
లోన్ల పేరిట రూ.5 కోట్ల కుచ్చుటోపీ
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: లోన్లు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలోని ఓ కాల్ సెంటర్‌పై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసారు. వీరి విచారణలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 27 మందికి లోన్లు ఇప్పిస్తామని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజు పేర రూ.5 కోట్లు కొల్లగొట్టినట్టు వెళ్లడయ్యింది. ఈరోజు మధ్యాహ్నం సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్ర మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Next Story