రేపు కొత్త ఆధారాలు ఇవ్వబోతున్నా: RS ప్రవీణ్ కూమార్ సంచలన ప్రకటన

by Disha Web Desk 19 |
BSP Chief RS Praveen Kumar Says An acre of land for the poor if we are empowered
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీక్‌పై మాట్లాడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తప్పించుకుని తిరుగుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ కుంభకోణంలో కేసీఆర్ వేసిన సిట్ ఏ మాత్రం విచారణ జరపకుండా అసలు నిందితులను కంటికి రెప్పలా కాపాడుతోందని ఆరోపించారు. సిట్ పనితీరు సరిగా లేదని అందువల్ల ఈ కేసులో కొత్త సాక్ష్యాలతో తాను రేపు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ సమర్పించబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు తీరని ద్రోహం చేసిన కేసీఆర్ మిమ్మల్ని ప్రజలు జైలుకు పంపండం ఖాయం అని మండిపడ్డారు

Next Story