నేత కార్మికులకు రూ.318 కోట్లు మంజూరు

by Muthe.Rajitha |

తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది.

నేత కార్మికులకు రూ.318 కోట్లు మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. నేత కార్మికులకు ప్రభుత్వం రూ.318 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఒక జత చేనేత చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తెసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటి తయారీకి సంబంధించిన భారీ ఆర్డర్స్ ను చేనేత కార్మికులకు అందించింది. ఈ చీరలకు సంబంధించిన బిల్లులను నేడు ప్రభుత్వం విడుదల చేస్తూ ఆర్డర్స్ జారీ చేసింది.

Next Story