TSPSC పేపర్ల లీకేజీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం: రేవంత్ రెడ్డి

by Disha Web Desk 19 |
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో కూడా పలు పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందన్నారు. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంత జరుగుతోన్న ప్రభుత్వం తరుఫు నుండి ఫిర్యాదు లేదని.. ఈ ఘటనపై విచారణ చేపడితే ప్రభుత్వంలోని పెద్దలు దొరుకుతారనే పేపర్ లీకేజీపై ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లేదని ఆరోపించారు. పేపర్ లీకేజీపై ఫిర్యాదు అందకున్నా పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed