Breaking: ఎన్‌హెచ్‌-65పై రోడ్డు ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

by Ramesh Naini |

సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో ఎన్‌హెచ్‌-65పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Breaking: ఎన్‌హెచ్‌-65పై రోడ్డు ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో ఎన్‌హెచ్‌-65పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను మెదక్ నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు సమాచారం.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story