మండిపోతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

by Disha Web Desk 7 |
మండిపోతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా నమోదు అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ వెదర్ రిపోర్ట్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. హైదారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మూడు జిల్లాల్లో 36 నుండి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు నగర వాసులు ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed