హైదరాబాద్‌లో విప్లవ కవి వరవరరావు.. సరోజినీ ఆస్పత్రిలో కంటి చికిత్స!

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లో విప్లవ కవి వరవరరావు.. సరోజినీ ఆస్పత్రిలో కంటి చికిత్స!
X

దిశ, తెలంగాణ బ్యూరో: విప్లవ కవి వరవరరావు కంటి పరీక్షల కోసం నగరంలోని సరోజినీ దేవి ఆస్పత్రికి వచ్చారు. భీమా కొరేగావ్ కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై ముంబై నగరంలో ఉంటున్న ఆయన హెల్త్ గ్రౌండ్స్ మీద విమానంలో శనివారం నగరానికి చేరుకున్నారు. నేరుగా సరోజినీ దేవి ఆస్పత్రికి వెళ్ళి సూపరింటెండెంట్‌ను కలుసుకున్నారు. గత కొంతకాలంగా కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయనను పరీక్షించిన వైద్యులు ‘ఫాకో’ విధానంలో సర్జరీ చేశారు.

దృష్టి సమస్యలు ఎదుర్కొంటున్నందున అన్ని రకాల పరీక్షలు చేసి వెంటనే సర్జరీ చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సర్జరీకి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆరోగ్యం సహకరించడంతో అనెస్థీషియా ఇచ్చి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మందులు వాడాల్సి ఉన్నందున మరోసారి చెకప్ కోసం ఆస్పత్రిని సందర్శించే అవకాశమున్నది.









Next Story