నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం గర్వకారణం: రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం గర్వకారణం: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అభినందించారు. న్యూ ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణం సాధించింది. స్వర్ణ పతకాన్ని సాధించడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్‌లో భారత్‌కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు.



Next Story

Most Viewed