- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ సమ్మిట్తో పెరిగిన రేవంత్ గ్రాఫ్.. పాలనపై పట్టు సాధిస్తున్న సీఎం
సీఎం రేవంత్రెడ్డి గ్రాఫ్పెరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్రెడ్డి గ్రాఫ్పెరుగుతున్నది. గత రెండు నెలల్లో వరుస వరుస పరిణామాలు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్ఉప ఎన్నిక ఫలితం, ఆ తర్వాత గ్లోబల్రైజింగ్సమ్మిట్, ఫుట్బాల్దిగ్గజంతో మ్యాచ్విజయవంతం కావడం వంటి ఘట్టాలతో ఆయనకు సరికొత్త అభిమానులు ఏర్పడ్డారు. గత రెండు నెలల్లో జరిగిన కార్యక్రమాలు, పరిణామాలు రేవంత్రెడ్డిని మరికొన్ని వర్గాలకు చేరువ చేశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు వచ్చేలా కొన్ని రోజులుగా కార్యక్రమాలు జరిగాయని చెబుతున్నారు. ఓవైపు అధికార యంత్రాంగం పరంగా, మరోవైపు పార్టీలోనూ ఆయనకు పట్టుపెరిగింది. కాంగ్రెస్అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారమంతా ఉత్తిదేనని తేలిపోయింది. నెల రోజుల్లోనే రాహుల్గాంధీని రేవంత్రెడ్డి రెండు సార్లు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్మ్యాచ్చూడటానికి ఢిల్లీ నుంచి రాహుల్గాంధీ వచ్చారని అభిమానులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత పట్టు సాధించి అధికార యంత్రాంగం, పార్టీని మరింత పరుగులు పెట్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ గెలుపుతో..
ఇటీవల ముగిసిన జూబ్లీహిల్స్ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. సీఎం రేవంత్రెడ్డి అన్నీతానై నడిపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేశారు. అభ్యర్థి ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాంగ్రెస్గెలుపు ఈజీ అయింది. గెలుపు తమదేనని అతివిశ్వాసంతో వ్యవహరించిన గులాబీ నేతలకు ఫలితం తీవ్ర నిరాశకు గురిచేసింది. నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో భారీ మెజార్టీ అందించడంతో రేవంత్రెడ్డికి అన్నివర్గాల నుంచి పొగడ్తలు వచ్చాయి. దీంతో ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలోనూ ఆయనకు ఎదురులేకుండా పోయింది.
గ్లోబల్ సమ్మిట్ సక్సెస్
కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖులను ఆహ్వానించి నిర్వహించిన గ్లోబల్రైజింగ్సమ్మిట్విజయవంతమైంది. సుమారు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపచంలోని అగ్రగ్రామి కంపెనీలు, సంస్థలు, దేశీయ సంస్థలు ముందుకొచ్చాయి. తమకు పెట్టుబడులపై ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న అపోహలు, అనుమానాలు ఈ సమ్మిట్ద్వారా తీరాయని పారిశ్రామిక, ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ, రియల్ఎస్టేట్రంగ ప్రముఖులు చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ పారిశ్రామిక, రియల్ఎస్టేట్కార్యకలాపాలు పుంజుకుంటాయని దీమా వ్యక్తం చేస్తున్నారు.
హైప్ పెంచిన మెస్సీ మ్యాచ్
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన సంబరాల్లో భాగంగా అంతర్జాతీయ ఫుట్బాల్దిగ్గజం లియోనిల్మెస్సీ టూర్హైదరాబాద్లో ఉండేలా ఏర్పాటు చేయించడంలో సీఎం రేవంత్రెడ్డి సక్సెస్అయ్యారు. స్వయంగా ఫుట్బాల్క్రీడాకారుడైన రేవంత్రెడ్డి మెస్సీతో గేమ్ఆడటానికి ముందు వామప్మ్యాచ్ల్లో పాల్గొన్నారు. ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో గేమ్ఆడతారని సమాచారం రావడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఉప్పల్స్టేడియం వద్ద టికెట్ల కోసం ఎగబడ్డారు. మ్యాచ్ను స్వయంగా చూడటానికి కాంగ్రెస్అగ్రనేత, విపక్ష నేత రాహుల్గాంధీ ఢిల్లీ నుంచి రావడంతో కాంగ్రెస్పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. అంతర్జాతీయ ఫుట్బాల్క్రీడాకారుడిని హైదరాబాద్కు రప్పించడం, ఆయనతో గేమ్ ఆడటంతో రేవంత్రెడ్డి పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగాయి. ఇంత మంచి జరిగినా ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా సక్సెస్కాలేకపోతున్నదని పార్టీలోని కొందరు ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






