మూతపడ్డ స్కూల్స్‌కు విద్యారంగంలో నూతన ఊపిరి

by Bhanu |

ప్రైవేట్‌తో పోటీని తట్టుకోలేక విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గింది. కష్టమైన, నాణ్యమైన విద్య అం దించాలనే

మూతపడ్డ స్కూల్స్‌కు విద్యారంగంలో నూతన ఊపిరి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రైవేట్‌తో పోటీని తట్టుకోలేక విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గింది. కష్టమైన, నాణ్యమైన విద్య అందించాలనే పట్టణాల్లోని ప్రైవేట్​ స్కూల్స్​కు పంపిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాం తాల్లోని ప్రభుత్వ స్కూల్స్​ మూతపడ్డాయి. ఈ స్కూల్స్​కు పూర్వ వైభవం తీసుకరావాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీఈవోలు టీచర్లతో కలిసి పక్కా ప్రణాళి కతో ముందుకెళ్తున్నారు. గ్రామస్తుల సా యంతో యువతను కలుపుకొని ప్రభుత్వ స్కూల్స్​పై తల్లిదండ్రులకు అవగాహన క ల్పించారు. ఇప్పుడు మూతపడిన స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో కళకళ లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పరిధిలో కూడా స్కూల్స్​ ప్రారంభించాలని దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది.

జిల్లాలో 27 స్కూల్స్​ రీ ఓపెనింగ్​..

రంగారెడ్డి జిల్లాలో 1309 ప్రభుత్వ స్కూల్స్​ ఉన్నాయి. ఇందులో ప్రైమరీ 880, అప్పర్​ ప్రైమరీ 180, హైస్కూల్స్​ 249 చొప్పున ఉన్నట్లు లెక్కలు ఉన్నాయి. ఇందులో 27 ప్రైమరీ స్కూల్స్​లో విద్యార్థుల సంఖ్య జీరో కావడంతో మూతపడటం జరిగిం ది. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో ప్రభు త్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్​, విద్యాధికారులు కలిసి మూతపడిన స్కూల్స్​ తిరిగి తెరిపించేందుకు తీవ్ర కృషి చేశారు. మూతపడిన స్కూల్స్​కు మొదటగా టీచర్ల ను కేటాయించి, ఆ తర్వాత పూర్తి స్థాయి లో డిప్యూటేషన్​ కల్పిస్తూ నిర్ణయాలు తీ సుకున్నారు. దీంతో ఆ 27 స్కూల్స్​లో సుమారు 250 మంది విద్యార్థులను చేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఏడాదిలో 1244 స్కూల్స్​కు 1,38,000 మంది ఉన్నారు. 1309 స్కూల్స్​కు 1,46,000 మంది విద్యార్థుల సంఖ్య పెంచినట్లు వెల్లడిస్తున్నారు. షాబాద్​ మం డలం, ముచ్చింతల్‌లోని ప్రైమరీ స్కూల్స్​లో విద్యార్థుల లేకపోవడంతో మూతపడింది. మంచాల మండలం, ఎల్లమ్మతండాలో ప్రవేశం లేక మూతపడింది. ఈ ఏ డాది విద్యాధికారులు, కలెక్టర్​ నిఘాతో విద్యావంతులు, యువత ముందుకచ్చి ప్ర భుత్వ స్కూల్స్​కు రంగులు దిద్ది సంఖ్య పెంచి స్కూల్స్​ కాపాడుకున్నారు.

త్వరలో గ్రామానికో స్కూల్​..

ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజ లను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ స్కూల్స్​ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటి వరకు ప్రైవేట్​ స్కూల్స్​తో పాటు కార్పొరేట్ స్కూల్స్​కే అధిక ప్రాధాన్యతిస్తూ గత ప్రభుత్వాలు నిర్ణ యాలు తీసుకున్నాయి. కానీ కాం గ్రెస్​ ప్రభుత్వం కొత్త పంథలో ప్రభుత్వ స్కూల్స్​ అభివృద్ధికి శ్రీకా రం చూట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారం భించే స్కూల్స్​కు ఈ ఏడాది చివ రలో టీచర్ల నియమాకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

10 వేల మంది విద్యార్థుల చేరికే లక్ష్యం : సుశీంధర్​ రావు, జిల్లా విద్యాశాఖాధికారి, రంగారెడ్డి

ప్రభుత్వ ఆదేశాలతో మూతపడ్డ స్కూల్స్​ రీఓపెనింగ్​ చేశాం. 27 స్కూల్స్​ రీ ఓపెనింగ్​ చేసి 250 మంది కొత్తగా చేర్చుకున్నాం. వీటితో పాటు రన్నింగ్​లోని స్కూల్స్​లో మొత్తంగా 10 వేల మందిని చేర్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానికి కూడా దగ్గరలోనే ఉన్నాం. ఆగస్ట్ నాటికి ఆ సంఖ్య పూర్తి చేస్తాం. స్థానిక గ్రామస్తులతో పాటు విద్యావంతులు, యువత మా టీచర్లకు పూర్తిగా సహకరించారు. అందరి కృషితోనే విద్యార్థుల సంఖ్య పెంచుతున్నాం.


Next Story