ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు రిమాండ్

by Disha Web Desk 4 |
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు షాక్ ఇచ్చింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను జడ్జి విధించారు. దీంతో చంచల్ గూడ జైలుకు రాధాకిషన్ రావును పోలీసులు తరలించారు. ఇక, ఈ కేసు విచారణలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలలో పని చేసినట్లు సీఐ గట్టు మల్లు ఎంక్వైరీలో తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఏప్రిల్ 2 వరకు ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావును కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయ స్థానం నిరాకరించింది.


Next Story

Most Viewed