- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ పదవుల భర్తీ
by Yella Dhawani Reddy |
మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తల నియామకానికి గవర్నర్ ఆమోద ముద్రవేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తల నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఆమోద ముద్ర వేశారు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్గా జస్టిస్ షమీమ్ అక్తర్ను నియమించారు. మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా రమాదేవి, కిషోర్ కుమార్లను నియమించారు. వీరి నియామకానికి ఈనెల 5న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కమిటీ ఈ పేర్లను సూచించగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ రాజశేఖర్రెడ్డి ప్రస్తుతం రేరా అప్పిలెట్ ట్రిబ్యునల్ ఛైర్మన్గా బాధ్యతల్లో ఉన్నారు. షమీమ్ అక్తర్ ప్రభుత్వం నియమించిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఛైర్మన్గా వ్యవహరించారు.
Next Story






