సైకిల్ పైనే 41,400Kms వెళ్లిన యాత్రికుడు రంజిత్

by Pooja |   ( Updated:2024-12-14 11:13:32.0  )
సైకిల్ పైనే 41,400Kms వెళ్లిన యాత్రికుడు రంజిత్
X

దిశ, వెబ్ డెస్క్: సైకిల్ పైన పక్క ఊరికి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్న ఈ రోజుల్లో వరంగల్‌కి చెందిన రంజిత్ అనే వ్యక్తి ఏకాంగ 41,400Kms సైకిల్ పైనే ప్రయాణం చేశాడు. తన తండ్రికి ప్రపంచ యాత్ర చేయ్యాలనే కల ఉండేదని, కానీ ఆయన 2020లో మరణించగా, తన తండ్రి కలను రంజిత్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో సైకిల్ పైనే తన యాత్రను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 13 దేశాల్లో పర్యటించారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాలో ఉండగా గబ్బా టెస్టును చూసేందుకు వెళుతున్నానని పోస్ట్ చేశాడు. వేల కిలోమీటర్లు ఒక్కడే ఒంటిరిగా.. ప్రపంచంలోని కీలక దేశాల బార్డర్లు దాటుకుంటూ.. ప్రయాణం చేస్తున్న రంజిత్ నేటి తరం యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed