ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా.. నాకోసం వెతకొద్దు

by Disha Web Desk 20 |
ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా.. నాకోసం వెతకొద్దు
X

దిశ, బడంగ్​పేట్​ : నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని, నా కోసం వెతుకొద్దని కుమారుడికి చెప్పి తల్లి అదృశ్యమయిన ఘటన పహాడిషరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. పహాడిషరీఫ్​ ఇన్​స్పెక్టర్​ కిరణ్​ తెలిపిన వివరాల ప్రకారం జల్​పల్లి గ్రామం అదానన్​ కాలనీకి చెందిన నసీన్​బేగం(45), లేట్ మొహమ్మద్​ మఖ్భూల్​ లు దంపతులు. భర్త చనిపోవడంతో నసీన్​బేగం, కుమారుడు మొహమ్మద్​ మన్నన్​తో కలిసి ఉంటుంది. ఈ నెల 14వ తేదీన ఉదయం 8.30 గంటలకు ఎప్పటిలాగే మొహమ్మద్​ మఖ్భూల్ లింగంపల్లిలో డ్యూటికి వెళ్ళాడు.

దీంతో ఒంటరిగా ఉన్న తల్లి నసీన్​ బేగంకు మొహహ్మద్​ మఖ్బూల్​ ఫోన్​ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన తల్లి నేను ఇంటి నుంచి వెళ్లి పోతున్నానని, నా కోసం వెతకొద్దని చెప్పింది. వెంటనే లింగంపల్లి నుంచి కుమారుడు జల్​పల్లికి చేరుకున్నాడు. తల్లి ఫోన్​ కూడా స్విచ్​ఆఫ్ ​చేసి ఉంది. దీంతో ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్క​ల బంధువుల ఇంట్లో వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో మన్నన్​ పహాడిషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed