అదృశ్యమయ్యాడు.. శవమై కనిపించాడు

by Disha Web Desk 20 |
అదృశ్యమయ్యాడు.. శవమై కనిపించాడు
X

దిశ, తాండూరు రూరల్ : అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించిన ఈ ఘటన కరన్ కోట్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం తాండూరు మండలం చింతామణిపట్నం గ్రామానికి చెందిన ఎల్లప్ప (45 ) ఈ నెల 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి రాకపోవడంతో అప్పటి నుంచి కనిపించడంలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో 13వ తేదీవ కుటుంబీకులు కరన్ కోట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించి కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామ శివారులోని చెరువులో ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై మధుసూదన్ రెడ్డి సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. చనిపోయిన వ్యక్తి నర్సింహులును గుర్తించి కుటుంబీకులకు విషయాన్ని తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.



Next Story

Most Viewed