రాష్ట్ర, జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కుల్కచర్ల విద్యార్థులు

by Disha Web Desk 20 |
రాష్ట్ర, జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కుల్కచర్ల విద్యార్థులు
X

దిశ, కుల్కచర్ల : రాష్ట్ర, జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ముజాహిద్ ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో ఈ నెల 21వ తేదీల్లో జరిగిన వాలీబాల్ జూనియర్ అసోసియేషన్లో విద్యార్థిని అఖిల శివ సాయి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయింది. ఈ నెల 18, 19, 20 తేదీలలో వరంగల్ లో జరిగిన వాలీబాల్ క్రీడలో భాగంగా విద్యార్థి అభివర్షిత్ జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా పాఠశాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Next Story

Most Viewed