- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేవెళ్లలో కాంగ్రెస్ బలం.. నాయకత్వ లోపమే శాపం..
కాంగ్రెస్ పార్టీ అంటే బడుగుబలహీన వర్గాలకు పెన్నిధిగా పేరొందిన పార్టీ.

దిశ, చేవెళ్ల : కాంగ్రెస్ పార్టీ అంటే బడుగుబలహీన వర్గాలకు పెన్నిధిగా పేరొందిన పార్టీ. కూడు గూడు లేని జనాలకు నెత్తిన నీడై కంచంలో మెతుకై నిలించిన పార్టీ ఎమర్జెన్సీ విధించి అధికారం కోల్పోయిన ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అనతి కాలంలోనే అధికారాన్ని చేజెక్కించుకుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంలోను కీలకపాత్ర పోషించి మూడు ముక్కలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు నాట తెలుగు నాడిని ఒకటి చేసిన ఖ్యాతి ఆ పార్టీది. దాదాపు అర్థ శతాబ్దం దేశాన్ని పాలిస్తూ సబ్బండ వర్గాల కోసం పటిష్టమైన చట్టాలు తెచ్చింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఇలాంటి పార్టీలో చేవెళ్లలో నాయకత్వలోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. గ్రూపులు గ్రూపులుగా నాయకులు రాజకీయం చేస్తూ కార్యకర్తలకు ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ ఉన్నచేవెళ్లలో నాయకత్వ లోపం ఉండడం గర్వకారణం. నాయకులందరిని ఒకే తాటిపైకి తీసుకుకొస్తే అధికారానికి చేరువుతుందని కార్యకర్తల అభిప్రాయం. చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ కోసం రచ్చమల్ల సిద్దేశ్వర్, పామేనా భీంభారత్, సున్నపు వసంతం, షాబాద్ దర్శన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటికైనా అధిష్టానం అలోచించి చేవెళ్ల ఇంచార్జిగా మంచి నాయకుడుని నియమించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.






