- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
2,877 కేంద్రాల ద్వారా పోలింగ్ .. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 29,38,370 మంది ఓటర్లు
దిశ,రంగారెడ్డి బ్యూరో: ఈనెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ సర్వం సిద్ధం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులతో సమన్వయం చేసుకుంటూ శిక్షణ, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎం పరికరాల కమీషనింగ్ వంటి పూర్తి ప్రక్రియను పూర్తి చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు కలుపుకొని ఉన్న పార్లమెంట్ చేవెళ్ల నియోజకవర్గం. ఈ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం కలిపి 29,38,370 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 15,04,260... మహిళలు 14,33,830... ఇతరులు 967 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు పూర్తిస్థాయిలో రిటర్నింగ్ అధికారి ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 2877 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నట్లు తెలుస్తోంది.
పోలింగ్ కు సర్వం సిద్ధం...
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 2877 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 23 వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి ఎన్నికల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా 10,791 బ్యాలెట్, 3,594 కంట్రోల్, 4025 వీవీ ప్యాట్ యూనిట్ యంత్రాలను అందుబాటులో ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. అయితే పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు పోలీస్ బందోబస్తు తో ప్రణాళిక చేశారు.
సామగ్రి పంపిణీ...
పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను ఎంపిక చేసి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. బాలాపూర్ మండలం బడంగ్పేట్ స్పూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో మహేశ్వరం, రాజేంద్రనగర్ మండలంలోని ఓల్డ్ వెటర్నరీ కాలేజీలో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని జీఎంసీ బలయోగి ఇండోర్ స్టేడియం శేరిలింగంపల్లి, చేవెళ్ల మండలం గోల్లేపల్లి గ్రామంలోని బండారీ శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేవెళ్ల, పరిగి మండల కేంద్రంలో మినీ స్టేడియంలో పరిగి, వికారాబాద్ మండల కేంద్రంలో మేరీ ఏ కొంటు స్కూల్లో వికారాబాద్, తాండూర్ మండల కేంద్రంలో సెయింట్ మెక్స్ ఇంటర్నేషనల్ హైస్కూల్లో తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారానే పోలీంగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి పోలింగ్ సామాగ్రిని ఆదే కేంద్రాల్లో సిబ్బంది అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల ఈవీఎంలను చేవెళ్ల మండలం గొల్లెపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చనున్నారు. ఈ కేంద్రం నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది.
పూర్తి బందోబస్తు...
పార్లమెంట్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పూర్తిగా ఆ సమయం అంతా సైలెంట్ మూడ్గానే ఎన్నికల అధికారులు పరిగణించనున్నారు.