ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం

by Disha Web Desk 19 |
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి మంచిరెడ్డి పద్మమ్మ కొద్దిసేపటిక్రితం కన్నుమూశారు. వృద్దాప్యం, అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ ఆమె స్వగ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో కొద్దిసేపటిక్రితం కన్నుమూశారు. అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11.45 గంటలకు ఎలిమినేడులో నిర్వహించనున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు మనువడు ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ ), బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాతృమూర్తి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంచిరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Next Story

Most Viewed