కూసుకుంట్లను గెలిపించి అభివృద్ధికి సహకరించండి : మంత్రి సబితా

by Disha Web Desk 20 |
కూసుకుంట్లను గెలిపించి అభివృద్ధికి సహకరించండి : మంత్రి సబితా
X

దిశ, మీర్ పేట : మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పటోల్ల సబితాఇంద్రారెడ్డి ఆ ప్రాంత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఉపఎన్నిక సందర్భంగా మునుగోడులో విస్తృతంగా పర్యటిస్తున్న ఆమె గురువారం రాత్రి మీర్పేట్ లోని ఎస్ వై ఆర్ ఫంక్షన్ హాల్ లో మహేశ్వరం నియోజకవర్గంలో నివసిస్తున్న మునుగోడు ప్రాంత ఓటర్లతో సమావేశమయ్యారు. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించే భాద్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని మంత్రి కోరారు.

స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, పలు సర్వేరిపోర్టలను పరిశీలించిన తర్వాతనే సీఎం కేసీఆర్‌ కూసుకుంట్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంట్రాక్ట్ ల కోసం పార్టీలు మారే నాయకులు ప్రజల కోసం ఏం పని చేస్తారని, నిరంతరం ప్రజలకోసం తాపత్రయపడే ముఖ్యమంత్రి కేసీఆర్ బలపర్చిన కూసుకుంట్లను గెలుపించాలని మంత్రి సబితా మునుగోడు ఓటర్లను కోరారు.

Next Story

Most Viewed