నత్తనడకన మనఊరు మనబడి పనులు..!

by Disha Web Desk 20 |
నత్తనడకన మనఊరు మనబడి పనులు..!
X

దిశ, తాండూరు రూరల్ : సర్కారు బడులలో వసతుల కల్పన కోసం చేపట్టిన మన ఊరు మనబడి పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాండూరు మండలం అంతారం గ్రామంలో మన ఊరు మన బడి అభివృద్ధి కొరకు రూ.9 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎస్ఎంసి చైర్మన్ పనులు చేపడుతున్నారు. రేపటి నుంచి పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి.

చైర్మన్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అయినా కాంట్రాకర్ నిర్లక్యంతో పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. పనుల్లో జాప్యం జరిగిందని విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పలు అనుమానులకు దారి తీసింది. ఇప్పటికైనా పనులను త్వరగా పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story

Most Viewed