రైతులు అప్రమత్తంగా ఉండాలి

by Disha Web Desk 11 |
రైతులు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, యాచారం : రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సందీప్ కుమార్ గురువారం పలు సూచనలు చేశారు. 19వ తేదీ నుంచి 23 వరకు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటుతాయని, రాత్రి వేళల్లో 30 డిగ్రీలతో వేడి గాలులు ఉంటాయని తెలిపారు. ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తాయని కల్లాలలో వడ్లు ఉంటే తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మావిడి తోటలలో కోతకు వచ్చిన కాయలను వెంటనే కోతలు పెట్టాలని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed