సాగును పండగ చేసి రైతును రాజుగా చేశాడు : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

by Disha Web Desk 11 |
సాగును పండగ చేసి రైతును రాజుగా చేశాడు : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి
X

దిశ, పరిగి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయాన్ని పండగ చేసి రైతును రాజుగా సీఎం కేసీఆర్​ చేశారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రంగాపూర్​ శివారులోని రైతు వేధికల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా రైతులు, ఎద్దుల బండ్లలో ఊరేగింపుగా వచ్చారు. అనంతరం రైతు వేధికలో సమావేశం నిర్వహించారు. నస్కల్​ గ్రామంలో రైతు బంధు మండల కన్వీనర్​ మేడిద రాజేందర్​ అధ్యక్షతన రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రైతు బంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాల గురించి చర్చించారు.

అలాగే చిగురాల్​ పల్లి, గడిసింగాపూర్​, సయ్యద్​ పల్లి, రాపోల్​ గ్రామాల్లోని రైతు వేధికల్లో రైతు దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచులు, రైతు సంఘాల సభ్యులు, రంగాపూర్​ గ్రామంలో ఎంపీపీ కరణం అరవింద్​ రావ్​, చిగురాల్​ పల్లిలో జడ్పీటీసీ బేతు హరిప్రియ, రాపోల్​ ఏఎంసీ చైర్మన్​ అంతిగారి సురేందర్​ కుమార్​, నస్కలో పీఏసీఎస్​ చైర్మన్​ కొప్పుల శ్యాసుందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed