- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండ : రంజిత్ రెడ్డి
దిశ, శంషాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండ అని చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామాంజాపూర్ ఎంపిటిసి క్రాంతి కుమార్ తోపాటు 200 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం దొరలపాలెంలో కొనసాగిందని గొప్పలు చెప్పడమే తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రభంజనంతో గెలిచి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పథకాలను తీసుకువచ్చి 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు.
పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని, మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సత్తా చాటుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త బేశ జ్వాలలకు పోకుండా కలిసికట్టుగా పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఫీక్, బాబు రావు,అశోక్, రమేష్,సలీం, జంగయ్య, గణేష్, ప్రభాకర్, మురళి, వహిద్,సంపత్,బాలయ్య, దాసు,మహేష్, మల్లయ్య, శ్రీనాథ్,సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.