రైతన్నకు అండగా సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

by Disha Web Desk 11 |
రైతన్నకు అండగా సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
X

దిశ, ఆమనగల్లు: అన్నం పెట్టే రైతన్నకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కడ్తాల్ పట్టణ కేంద్రంలో రైతుల సమక్షంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, స్పెషల్ కమిషనర్ హనుమంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రైతుల సంక్షేమం కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఆమనగల్లు మండలంలోని 4 రైతువేదిక భవనాలలో, మాడ్గుల మండలంలోని 7 రైతు వేదిక భవనాలలో వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాలలో వ్యవసాయ శాఖ అధికారులు శ్రీలత, అరుణకుమారి, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు పత్య నాయక్, జడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ కమ్లి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జోగు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed