బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్…కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీలు

by Disha Web Desk 11 |
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్…కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీలు
X

దిశ, షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా షాక్ లు తగులుతున్నాయి. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతాప్ రెడ్డి తో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు కాంగ్రెస్​ లో చేరారు. ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం నాడు ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. శుక్రవారం నాడు జగిత్యాల జిల్లా కొరుట్లలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర క్యాంపులో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఇంకా పార్టీలోకి చేరికలు ఉంటాయని అన్నారు.పార్టీలో చేరిన వారిలో కేశంపేట జెడ్పీటీసీ తాండ్ర విశాల, ఫరూఖ్ నగర్ జెడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి, మైనార్టీ నేత జమృద్ ఖాన్, క్రాంతి రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉన్నారు.


Next Story

Most Viewed