మరోసారి ఇంటర్నెట్ నిషేధం పొడిగించిన పంజాబ్‌

by Disha Web Desk 12 |
మరోసారి ఇంటర్నెట్ నిషేధం పొడిగించిన పంజాబ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృత పాల్ సింగ్ ను అణిచివేసేందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం వారు కేంద్ర బలగాల సహాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా అమృత పాల్ సింగ్ ను పోలీసులు పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే అల్లర్లు జరగకుండా పంజాబ్ ప్రభుత్వం ముందస్తుగానే ఈ నెల 19 వరకు పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు రద్దు చేసింది. అనంతరం దీనిని ఈ నెల 20 వరకు పొడిగించింది. అయితే అమృత పాల్ సింగ్ ఇంకా దొరక్కపోవడంతో ఇంటర్నెట్ సేవలు ఈ నెల 21 వరకు రద్దు చేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.


Next Story

Most Viewed