ఘోరం.. అసభ్యకరంగా మాట్లాడాడని ఫ్రెండ్‌నే హత్య చేసిన యువకుడు

by Disha Web Desk 19 |
ఘోరం.. అసభ్యకరంగా మాట్లాడాడని ఫ్రెండ్‌నే హత్య చేసిన యువకుడు
X

దిశ, బడంగ్​పేట్: అసభ్యకరంగా మాట్లాడడన్న నెపంతో స్నేహితుడిని బండరాయితో మోది అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్​పోలీస్​స్టేషన్​పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ కాల్ ఆధారంగా 13 రోజుల అనంతరం మొహమ్మద్​షా ఫైసల్ హత్యోదంతం కేసును పోలీసులు ఛేదించారు. వివరాలలోకి వెళితే.. బాలాపూర్​మండలం, వెంకటాపురం గ్రామం ఉస్మాన్​నగర్‌కు చెందిన మొహమ్మద్ జాఫర్​కుమారుడు మొహమ్మద్​షా ఫైసల్​(25) మదీనా దగ్గర బట్టల దుకాణంలో పనిచేసేవాడు. ఐదు నెలల క్రితం మొహమ్మద్​షా ఫైసల్‌కు స్థానిక యువతితో వివాహం జరిగింది.

ప్రస్తుతం అతని భార్య గర్భవతి. అయితే, ఈ నెల 12వ తేదీన రాత్రి 8 గంటలకు ఫైసల్ ఫోన్​ మాట్లాడుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 13వ తేదీన బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న బాలాపూర్​పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫైసల్ చివరగా ఫోన్ మాట్లాడిన యువకుడిపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో ఆ యువకుడు నేరం అంగీకరించాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి మొహమ్మద్​షా ఫైసల్ తనపై అసభ్యకరంగా మాట్లాడినందుకే.. క్షణికావేశంలో అతనిపై కట్టె, బండ రాయి మోది హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్లు విశ్వసనీయ సమచారం. దీంతో హుటాహూటిన బాలాపూర్​పోలీసులు మీనార్ కాలనీలోని ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.



Next Story

Most Viewed