- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు కరెక్ట్ కాదు.. డిప్యూటీ సీఎం భట్టి సెన్సేషనల్ కామెంట్స్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు (Ramchander Rao) నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు (Ramchander Rao) నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లోని ఏఐసీసీ హెడ్ క్వార్ట్ర్స్లో సెంట్రల్ యూనివర్సిటీల స్థితిగతులపై సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి హాజరైన మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారత రాజ్యంగా ఇచ్చిన హక్కులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పూర్తిగా హరిస్తోందని మండిపడ్డారు. యూనివర్శిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రోహిత్ వేముల (Rohit Vemula) ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ (Rahul Gandhi) హెచ్సీయూ (HCU)కి వచ్చి విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దుతును ప్రకటించారనే విషయాన్ని గుర్తు చేశారు.
రోహిత్ వేముల తాను ఆత్మహత్యకు పాల్పడిన కారణాలను తన సూసైడ్ నోట్లో వెల్లడించారని పేర్కొన్నారు. అదే సమయంలో నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావు హెచ్సీయూకి వెళ్లి విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఒత్తిడి తెచ్చారని ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరికి దేశంలో బతికే హక్కు ఉందని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తెరగాలని హితువు పలికారు. కానీ, రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క కామెంట్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.






