రాజాసింగ్ సస్పెన్షన్.. తొలి జాబితా విడుదల వేళ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రాజాసింగ్ సస్పెన్షన్.. తొలి జాబితా విడుదల వేళ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ హై కమాండ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజామహల్‌పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ రాజాసింగ్ సస్పెన్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాలన్ని పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోందన్నారు. తెలంగాణ తొలి జాబితాకు సంబంధించి 50కి పైగా స్థానాల్లో కసరత్తు పూర్తయిందన్నారు. అభ్యర్థుల తొలి జాబితాలో 20కి పైగా సీట్లు బీసీలకు కేటాయిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కవిత పోరాటం చేశారని.. కానీ బీఆర్ఎస్ మహిళలకు సీట్లు కేటాయించలేదన్నారు.



Next Story

Most Viewed