- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Rythu bandhu' తెలంగాణ కలను సాకారం చేస్తుంది.. MLC Kavita ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. బుధవారం రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని 70 లక్షల మంది అన్నదాతలు రైతుబంధు ద్వారా రూ.7,676.61 కోట్ల సహాయం అందుకుంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో వెల్లడించారు. రైతులు, పేదలు సాధికారత పొందే భారతదేశం గురించి కేసీఆర్ కలలు కన్నారని చెప్పారు. రైతుబంధు పథకం తెలంగాణ కలను సాకారం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కాగా, ఈ సీజన్లో 70.54 లక్షల మంది రైతులకు చెందిన కోటి 53 లక్షల ఎకరాలకు రూ.7,676.61 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతుబంధు నిధులను బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది.






