- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rohith Vemula Act: రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించండి.. సీఎంకు రాహుల్ గాంధీ లేఖ

దిశ, డైనమిక్ బ్యూరో: రోహిత్ వేముల (Rohith Vemula Act) చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddharamaiah)కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేముల లాంటి వారికి వచ్చిన పరిస్థితిని ఎవరూ ఎదుర్కోకుండా ఉండేందుకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్టాటక ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రాహుల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా వివరాలను రాహుల్ గాంధీ పంచుకున్నారు. ఇటీవల పార్లమెంటులో తను దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులను కలిసినట్లు పేర్కొన్నారు. వారితో సంభాషణలో, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షను వారు ఎలా ఎదుర్కొంటున్నారో వారు పంచుకున్నారని వివరించారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య ద్వారా అణగారిన వర్గాలు తమను తాము శక్తివంతం చేసుకోగలరని, కులతత్వ అడ్డంకులను చేదించగలరని దారి చూపించారని తెలిపారు. అయితే, దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యా వ్యవస్థలో వివక్ష ఎదుర్కొడం దురదృష్టకరం అని రాహుల్ పేర్కొన్నారు. రోహిత్ వేముల, పాయల్ తద్వి, దర్శన సోలాంకి లాంటి వారు హత్యకు గురయ్యారని, ఇటువంటి భయంకరమైన సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమన్నారు. ఈ అన్యాయాన్ని పూర్తిగా అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు. కాగా, 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న రోహిత్ వేముల కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.