నిరూపిస్తే నా పేరిట ఉన్న గడీని CM రేవంత్ రెడ్డికి రాసిస్తా.. రఘునందన్ రావు సవాల్

by Disha Web Desk 2 |
నిరూపిస్తే నా పేరిట ఉన్న గడీని CM రేవంత్ రెడ్డికి రాసిస్తా.. రఘునందన్ రావు సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. తనకు గడీ ఉందని రేవంత్ రెడ్డి నిరూపించాలని చాలెంజ్ చేశారు. నిరూపిస్తే అది వారికే రాసి ఇచ్చేస్తా.. రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెట్టుకుంటానని రఘునందన్ రావు సవాల్ చేశారు. మహబూబ్‌నగర్‌లో కుట్రలు జరుగుతున్నాయంటున్నారు.. కుట్రలు జరిగితే డీజీపీని ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో కాదని.. తన పక్కన ఉన్నవారితోనే రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కవల పిల్లలు అని అన్నారు.

అధికారం మారినా రాష్ట్రంలో ఏ మార్పూ జరగడం లేదు. కేసీఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డితో మాకు ఎలాంటి దోస్తీ లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మత రాజకీయం చేస్తోందనేది పచ్చి అబద్ధం అని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటే అని సెటైర్ వేశారు. ఈ సారి హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు.. అమలు చేయడం మా వంతు అని కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.



Next Story

Most Viewed