- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు కమల్హాసన్పై రఘునందన్ రావు ఫైర్.. ఆ రాష్ట్ర సీఎంపై కూడా..
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయకులపై జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల చర్య దుర్మార్గమని అన్నారు. దేశం ఉలిక్కిపడే ఘటన జరిగితే సోకాల్డ్ సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin), ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్(Kamal Haasan) ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పైగా ఘటనపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఉగ్రదాడి(Terrorist Attack)లో పదుల సంఖ్యలో అమాయకులు బలయ్యారు.
తుపాకులతో వందల రౌండ్లు కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై ఇప్పటికే స్పందించిన ప్రధాని మోడీ(PM Modi), హోంమంత్రి అమిత్ షా(Amith Shah) దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో అక్కడి వ్యాపారులు గొప్ప మనసు చాటుకుంటున్నారు. భయంతో వణికిపోతున్న పర్యాటకులకు సాయం అందిస్తున్నారు. ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నారు.






