- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
suspended: లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్.. కాలేజీ యాజమాన్యం ప్రకటన

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల విశాఖపట్నం జిల్లాలోని (Raghu Engineering College) రఘు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్షరర్పై విద్యార్థిని దుర్భాషలాడుతూ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సైతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై రఘు విద్యాసంస్థల చైర్మన్ రఘు ఫ్యాకల్టీలతో సమావేశమైనట్లు తెలిసింది. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. లేడీ ఫ్యాకల్టీపై చేయిచేసుకోవడం, తిట్టడం వంటి చర్యల కారణంగా ఈసీఈ సెకండ్ ఇయర్కు చెందిన వెంకటలక్ష్మీ అనే విద్యార్థిని కాలేజీ నుంచి సస్పెండ్ (suspended) చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఘటనపై లోతుగా విచారణ జరిపి.. కాలేజీ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థిని ప్రవర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
కాగా, తన ఫోన్ తీసుకుందని లెక్షరర్ని బూతులు తిడుతూ స్టూడెంట్ వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆ ఫోన్ రూ.12 వేలు ఇస్తావా? లేదా అంటూ సహనం కోల్పోయిన విద్యార్థిని లెక్షరర్ని చెప్పుతో కొట్టింది. విద్యార్థిని తనను చెప్పుతో కొట్టడం ఏంటని భావించిన లెక్చరర్.. ఆ విద్యార్థిని వారించే ప్రయత్నం చేసింది. గొడవ తీవ్ర తరం కావడంతో ఇదంతా చూస్తున్న ఇతర విద్యార్థులు, తోటి లెక్చరర్స్ వారిని కంట్రోల్కి తెచ్చారు. ఆ వీడియో రాష్ట్రం అంతా వైరల్ కావడంతో మనస్తాపం చెంది మహిళా ఫ్యాకల్టీ రాజీనామా చేసినట్లు తెలిసింది. తోటి ఫ్యాకల్టీలు వారించినప్పటికీ తన రాజీనామా పత్రాన్ని మేనేజ్మెంట్కు అందించినట్లు సమాచారం.