- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్రాఫిక్ కానిస్టేబుల్ను అభినందించిన రాచకొండ సీపీ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలను చాకచక్యంగా కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ను సోమవారం రాచకొండ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ తన క్యాంప్ కార్యాలయంలోఅభినందించారు. ఈనెల 13న ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న సతీష్ విజయవాడ బస్టాపులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయంత్రం 6గంటల సమయంలో బతుకుదెరువు కోసం జార్ఞండ్ నుంచి ఇక్కడికి వచ్చి పనిదొరకక సమస్యలతో సతమతమవుతున్న మాంగ్ర (35) ఎల్బీనగర్ఫ్లై ఓవర్బ్రిడ్జీ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు.
ఇది గమనించిన సతీష్పరుగున అతని వద్దకు వెళ్లాడు. మాంగ్రతో మాట్లాడుతూ.. సమస్యలు ఏవైనా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానంటూ మాటల్లో పెట్టాడు. మెల్లిగా మాంగ్ర వద్దకు చేరుకుని అతను మెడలో వేసుకున్న టవల్ను పట్టుకుని గట్టిగా లాగి బ్రిడ్జీపైకి చేర్చాడు. అనంతరం పోలీసులకు అప్పగించాడు. ఈ క్రమంలోనే కమిషనర్చౌహాన్ సోమవారం సతీష్ను అభినందించి రివార్డుతోపాటు బహుమతిని అందించారు.