MP రేణుకా చౌదరిపై ప్రివిలేజ్‌ నోటీసులు

by Gantepaka Srikanth |

MP రేణుకా చౌదరిపై ప్రివిలేజ్‌ నోటీసులు

MP రేణుకా చౌదరిపై ప్రివిలేజ్‌ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ సముదాయంలోకి కుక్కను తీసుకొచ్చి.. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కుక్కలు కరవవని, సభలో కూర్చున్నవారే కరుస్తారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీలు బ్రిజ్‌లాల్‌, బాలగోస్వామి స్పీకర్‌కు ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను రాజ్యసభ చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. కాగా, ఇంతకుముందే.. కొందరు సభ్యులు సభాహక్కుల తీర్మానం పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలపై విలేకరులు ఆమెను ప్రశ్నించగా.. ఆమె బదులిచ్చారు. ‘భౌ..భౌ.. ఇంతకంటే నన్నేం చెప్పమంటారు?’ అని ప్రశ్నించారు. తీర్మానం, చర్చ వస్తే తగిన సమాధానం ఇస్తానని తెలిపారు.

Next Story