స్వప్నలోక్ ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. పరిహారం ప్రకటన

by Disha Web Desk 2 |
స్వప్నలోక్ ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. పరిహారం ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌‌లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు.


Next Story

Most Viewed