ఒకే వేదికపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి మోడీని సత్కరించారు.

ఒకే వేదికపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోడీ అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి ప్రధానితో పాటు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఐసీసీలో ప్రదాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ. 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మోడీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మాట్లాడనున్నారు.

Next Story