న్యూ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రధానీ..!

by Disha Web Desk 9 |
న్యూ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రధానీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని బండిపోర్ టైగర్ రిజర్వ్‌ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించడం జరిగింది. ప్రాజెక్టు టైగర్‌కు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా మోదీ ఈ పర్యటన చేశారు. అలాగే పులుల సంరక్షణ చేపట్టిన చర్యలు, జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి కేంద్రాలు, ఎలెఫెంట్ క్యాంప్స్ తదితర ప్రదేశాలను అధికారులు ప్రధానీకి చూపెట్టనున్నారు. అనంతరం తమిళనాడులోని ముదులై టైగర్ రిజర్వ్‌ కూడా సందర్శించారు. అయితే మోదీ బందీపూర్, ముదుమలై టైగర్ రిజర్వ్‌కు వెళ్లనున్నారని.. క్యాప్షన్ పీఎంవో పోస్టు చేసింది. దీనికి ప్రధాని ఫొటో కూడా జత చేసింది. ఇందులో ఆయన నల్ల టోపీ, ఖాకీ ప్యాంట్, క్యామోఫ్లాజ్ టీ షర్ట్, బ్లాక్ షూస్ ధరించి... ఒక చేత్తో స్లీవ్ లెస్ జాకెట్ పట్టుకొని స్టైలిష్‌గా కొత్త లుక్‌లో కనిపించారు.

Next Story

Most Viewed