కేసీఆర్ దేవుడికి మరింత దగ్గరవుతున్నారు: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కేసీఆర్ దేవుడికి మరింత దగ్గరవుతున్నారు: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన జీవితంలో ఏది జరిగిన అన్ని మంచి కొరకే జరుగుతాయని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ అన్నారు. ఇవాళ సోమాజీగూడ యశోద అస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌ను కేఏపాల్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అతి త్వరలో సంపూర్ణ స్వస్థత పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఈ విధంగా పడిపోవడం ఏంటీ..? ఇన్నిరోజుల ట్రీట్‌మెంట్ ఏమిటని..? అని అనుకుంటామన్నారు. ‘కేసీఆర్ దేవుడికి చాలా దగ్గరవుతున్నారు. ఇంత వరకు 70 ఏళ్లలో లేనంత క్లోజ్ రిలేషన్, కేసీఆర్ దేవుడికి క్లోజ్‌గా ఉన్నారు’ అని చెప్పారు.

కేటీఆర్‌ను తను ఇదే మొదటి సారి కలిశారని, తనను మంచిగా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. మరోసారి కేసీఆర్‌ వద్దకు ప్రేయర్ అయిల్ పట్టుకోని వస్తానని, ప్రేయర్ చేస్తే కేసీఆర్ స్వస్థత పొందుతారని అన్నారు. ప్రేయర్ అయిల్‌తో ఇంత ముందు కంటే యాక్టివ్ అవుతారని కేసీఆర్‌కు చెప్పినట్లు గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి రావడం కేసీఆర్‌ను పరామర్శించడం.. చాలా మంచి పరిణామమని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed