ఇంకెన్ని సంవత్సరాలు మోడీజీ..? నగరంలో మరోసారి ప్రధాని పోస్టర్ల కలకలం

by Disha Web Desk 19 |
ఇంకెన్ని సంవత్సరాలు మోడీజీ..? నగరంలో మరోసారి ప్రధాని పోస్టర్ల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఐదేండ్లైనా ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ 40% పూర్తి కాలేదని, ఇంకెన్ని సంవత్సరాలు కడతారు మోడీ అంటూ మంగళవారం ఫ్లైఓవర్ పిల్లర్లపై వాల్ పోస్టర్లు వెలిశాయి. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ప్లైఓవర్ పిల్లర్లకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో 2018 మే 5న కేంద్రమంత్రి నితిన్​గడ్కరీ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ఐదేండ్లు పూర్తి అవుతున్నా ఇప్పటికీ ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ 40 శాతం కూడా పూర్తికాలేదని విమర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed