హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ల కలకలం.. ఈ సారి బీఆర్ఎస్ కీలక మంత్రివి!

by Disha Web Desk 19 |
హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ల కలకలం.. ఈ సారి బీఆర్ఎస్ కీలక మంత్రివి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోస్టర్ల వార్ నడుస్తోంది. ఐదేళ్లైనా ఈ ఫ్లైఓవర్ ఇంకా పూర్తి కాలేదంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే నగరంలోని ఫ్లైఓవర్ పిల్లర్లపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం తాజాగా మంత్రి కేటీఆర్ పోస్టర్లు ఈ ఫ్లైఓవర్ పిల్లర్లపై దర్శనం ఇచ్చాయి. ప్రజలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని మీ భాషలో సమాధానం చెప్పడం ప్రజలకు తెలుసు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాలపై ఈ రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీలు, పోస్టర్ల వార్ నడుస్తుండగా తాజాగా ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణంపై మొదలైన పోస్టర్ల ఫైట్ ఎటువైపు వెళ్తుందో చూడాలి మరి.

Next Story

Most Viewed