- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్లో మళ్లీ పోస్టర్ల కలకలం.. ఈ సారి బీఆర్ఎస్ కీలక మంత్రివి!
by Satheesh |
ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోస్టర్ల వార్ నడుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోస్టర్ల వార్ నడుస్తోంది. ఐదేళ్లైనా ఈ ఫ్లైఓవర్ ఇంకా పూర్తి కాలేదంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే నగరంలోని ఫ్లైఓవర్ పిల్లర్లపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం తాజాగా మంత్రి కేటీఆర్ పోస్టర్లు ఈ ఫ్లైఓవర్ పిల్లర్లపై దర్శనం ఇచ్చాయి. ప్రజలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని మీ భాషలో సమాధానం చెప్పడం ప్రజలకు తెలుసు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాలపై ఈ రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీలు, పోస్టర్ల వార్ నడుస్తుండగా తాజాగా ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణంపై మొదలైన పోస్టర్ల ఫైట్ ఎటువైపు వెళ్తుందో చూడాలి మరి.
Next Story






